వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ దర్శనం.
116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారి జీవితకాల కోరిక నెరవేరింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనాన్ని విజయవంతంగా ముగించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, నవనీతమ్మ గారిని పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సోషల్ మీడియా, విజిలెన్స్ అధికారుల సహకారంతో ఈమెను గుర్తించి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...