వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
పార్వతి దేవి Jun 23, 2026 9:49 AM నిర్మల్ 3 viewsabout 4 hours ago

ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాననే మనస్తాపంతో భైంసా పట్టణానికి చెందిన 23 ఏళ్ల అక్షయ్ కుమార్ బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆదివారం ఇంటి నుండి బయలుదేరిన అక్షయ్, ఈ దారుణానికి పాల్పడ్డాడు.
నది ఒడ్డున అతని బైక్ లభించగా, సోమవారం ఘాట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...