వార్తలకు తిరిగి వెళ్లండి
ఆ మార్కెట్లో ఏం జరుగుతోంది?
Rohith Jun 20, 2026 5:56 AM విశాఖపట్నం 11 views2 days ago

జీవీఎంసీ పరిధిలోని కీలకమైన పూర్ణ మార్కెట్ వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక రాజకీయ నేత తెరవెనుక చక్రం తిప్పి, అధికారుల సహకారంతో గత ఏడాది కంటే చాలా తక్కువ ధరకే బినామీ ద్వారా ఈ వేలాన్ని దక్కించుకోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా పార్కింగ్, వ్యాపారుల రుసుములు పెంచి సదరు ముఠా దర్జాగా వసూళ్లకు పాల్పడుతోంది. భారీగా ఆదాయ గండి పడుతున్నా జీవీఎంసీ ఉన్నతాధికారులు మాత్రం కళ్లు మూసుకుని వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
Comments
Loading comments...