వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో విషాదం: సెప్టిక్ ట్యాంక్లో ముగ్గురు కార్మికులు మృతి
వివేక్ గౌడ్ Jun 26, 2026 11:46 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

ఢిల్లీలోని ముండ్కా పారిశ్రామిక ప్రాంతంలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ముగ్గురు కార్మికులు విషవాయువు పీల్చి మరణించారు. ట్యాంక్లోకి దిగిన వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అరుణ్, సందీప్, చంద్ అనే ముగ్గురు మృతులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిశ్రామిక భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...