Back to feed
తిరుమలలో శ్రీవారి భక్తజన సంద్రం
Sonia Singh May 22, 2026 5:29 AM అల్ ఇండియా 12 views6 days ago

తిరుమలలో వేసవి సెలవుల రద్దీ విపరీతంగా ఉంది. క్యూలైన్లు నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. గురువారం రికార్డు స్థాయిలో 79,603 మంది స్వామివారిని దర్శించుకున్నారని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
అధికారుల సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి పైగా దర్శనాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...



