Back to feed
తిరుమలలో సరికొత్త రికార్డు: మే నెలలో భారీగా తలనీలాలు
Rohit Singh Jun 01, 2026 12:03 PM తిరుపతి 2 viewsabout 1 hour ago

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులు సరికొత్త రికార్డు సృష్టించారు. గడచిన మే నెలలో (మే 1 నుండి 27 వరకు) స్వామివారికి రికార్డు స్థాయిలో 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా వెల్లడించింది. గతంలో ఉన్న అన్ని రికార్డులను అధిగమిస్తూ ఈసారి అత్యధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...



