Back to feed
గుడిసె లేని తెలంగాణే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Vikram Jun 18, 2026 5:00 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసె వాసులకే ప్రాధాన్యతనిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా సమగ్ర సర్వే చేపట్టి, పేదలందరికీ సొంత ఇళ్లు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
అసంపూర్తి గృహాలను పూర్తి చేయడంతో పాటు, రూఫ్ రీప్లేస్మెంట్ పథకం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...


