వార్తలకు తిరిగి వెళ్లండి
టీజీ20 : వరంగల్పై కరీంనగర్ ఉత్కంఠ విజయం
మానస శర్మ Jun 28, 2026 3:04 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

టీజీ20 లీగ్ 2026లో వరంగల్ వారియర్స్పై కరీంనగర్ డైమండ్స్ 2 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (133) సెంచరీతో 209 పరుగులు చేసింది.
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్.. రిషికేత్ సిసోదియా (65), భవేశ్ సేథ్ (53*) పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 207 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కరీంనగర్ బౌలర్ సతీష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Comments
Loading comments...