వార్తలకు తిరిగి వెళ్లండి
వింబుల్డన్: మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన స్వైటెక్

వింబుల్డన్ మహిళల సింగిల్స్లో పోలాండ్ స్టార్ ప్లేయర్, మూడో సీడ్ ఇగా స్వైటెక్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో ఆమె మూడో రౌండ్కు అర్హత సాధించింది.
చెకియాకు చెందిన ప్లిస్కోవాపై 6-1, 6-3 తేడాతో స్వైటెక్ సునాయాస విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది.
Comments
Loading comments...