వార్తలకు తిరిగి వెళ్లండి
చిట్టీల వ్యాపారం: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్
Ravi Jun 20, 2026 6:51 AM హన్మకొండ 17 views2 days ago

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చిట్టీల వ్యాపారం చేస్తూ మోసాలకు పాల్పడిన హనుమకొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యను డీఈవో సస్పెండ్ చేశారు. భీమదేవరపల్లి పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలను కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ ప్రాథమిక విచారణలో ధృవీకరించింది. దీనితో శాఖాపరమైన విచారణ చేపట్టి, బాధ్యుడైన టీచర్పై కఠిన చర్యలు తీసుకుంటూ డీఈవో గిరిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...