వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 270 మిలియన్ యూనిట్లు దాటిందని అధికారులు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

