వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా 78 మంది ఖైదీలు NIOS ద్వారా SSCలో ఉత్తీర్ణులయ్యారు. చర్లపల్లి, నిజామాబాద్ జైళ్లు, హైదరాబాద్ మహిళా జైలుకు చెందిన వారు ఉన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వారికి ప్రత్యేక రిమిషన్ ప్రకటించారు.
SSCకి 108 మంది చేరగా, చర్లపల్లి నుంచి 56, నిజామాబాద్ నుంచి 15, మహిళా జైలు నుంచి 7 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి ఉన్నత విద్య, సాంకేతిక కోర్సులకు శాఖ సహకారం అందించనుంది.
Comments
Loading comments...

