వార్తలకు తిరిగి వెళ్లండి
సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదు: ఎస్పీ ఎంపీ

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ విమర్శించారు. విరాళాలు ఇచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై సభలో చర్చ జరగాలన్నారు.
అలాగే డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులు దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, రాజ్యాంగబద్ధమైన నియంతృత్వాన్ని తెచ్చే కుట్రలని ఆయన మండిపడ్డారు. అందుకే ఆయా బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...