వార్తలకు తిరిగి వెళ్లండి
హోటళ్లలో బిర్యానీ ప్రియులకు షాకింగ్ నిజాలు

Photo Gallery
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని మూడు ప్రముఖ హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో చనిపోయిన ఈగలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు ప్రమాదకరమైన సింథటిక్ రంగులను అధికారులు గుర్తించారు.
కనీస పరిశుభ్రత పాటించని యాజమాన్యాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇటువంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...