వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్లో తూటాల కలకలం: ప్రయాణికుడి అరెస్టు
విష్ణు వర్ధన్ Jun 23, 2026 12:56 AM హైదరాబాద్ 10 viewsabout 3 hours ago

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం కలకలం రేగింది. విశాఖకు చెందిన మధుబాబు, తన బ్యాగులో రెండు లైవ్ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించాడు. భద్రతా తనిఖీల్లో వీటిని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తుపాకీ తూటాలకు సంబంధించి ఎటువంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...