వార్తలకు తిరిగి వెళ్లండి

వానకాలం మొదలైనా రాష్ట్రంలో వడగాల్పులు తగ్గడం లేదు. మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఎల్నినో ప్రభావంతో ఎండలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 23 నుండి నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
