వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షన్నర కోట్లతో సెమీకండక్టర్ మిషన్ 2.0 రెడీ

భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 (ISM 2.0) కోసం రూ. 1.25 లక్షల కోట్ల కేటాయింపుల ప్రతిపాదనకు ఆర్థిక శాఖ వ్యయ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతంలో మొదటి విడత (ISM 1.0) కోసం కేటాయించిన రూ. 76,000 కోట్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ వ్యయ కమిటీ ఆమోదించిన ప్రతిపాదన త్వరలోనే తుది నిర్ణయం కోసం కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది.
Comments
Loading comments...