వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠ్యపుస్తకాల వివాదంపై నవీన్ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు

పాఠ్యపుస్తకాలు పిల్లల భవిష్యత్తుకు పునాది అని, ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం తప్పులతడక పుస్తకాలను ముద్రించి లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఆరోపించారు.
ప్రభుత్వం తదుపరి ఎడిషన్లో తప్పులను సరిదిద్దవచ్చు కానీ, ఒక తరానికి జరిగిన నమ్మకద్రోహానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యం సమాజంపై పిల్లలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...