వార్తలకు తిరిగి వెళ్లండి
ఏబీవీపీ ఆందోళనపై పోలీసుల లాఠీఛార్జ్

విద్యార్థుల బకాయి ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఏబీవీపీ ఆరోపించింది. కాగా, పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Comments
Loading comments...