వార్తలకు తిరిగి వెళ్లండి
సాన్వలియా సేథ్ ఆలయ పారదర్శకత

రాజస్థాన్లోని ప్రసిద్ధ శ్రీ సాన్వలియా సేథ్ దేవాలయం తన పారదర్శక విరాళాల విధానంతో వార్తల్లో నిలిచింది. ఇటీవల హుండీ తెరవగా మొదటి రోజే ₹10.11 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక్కడ వ్యాపారవేత్తలు దేవుడిని తమ భాగస్వామిగా భావించి లాభాల్లో వాటా సమర్పిస్తారు.
నెలకు ₹30-40 కోట్ల వరకు వచ్చే విరాళాలను సీసీటీవీల నిఘాలో లెక్కిస్తారు. ఐదు బ్యాంకుల ద్వారా ఈ నిధులను సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు.
Comments
Loading comments...