వార్తలకు తిరిగి వెళ్లండి

నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఫిరోజా ప్రస్తుతం 7.5 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఫిరోజా చేతిలో ఓటమితో అతను 3.5 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. క్లిష్టమైన ఈ టోర్నీలో గుకేష్ తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి పోరాడుతున్నాడు.
Comments
Loading comments...

