వార్తలకు తిరిగి వెళ్లండి
జగ్గయ్యపేటలో 8 గంటల పాటు విద్యుత్ నిలిపివేత
దివ్య శ్రీ Jun 27, 2026 5:57 AM ఎన్టీఆర్ జిల్లా 2 viewsabout 2 hours ago

జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. 33 కేవీ బస్ల మార్పిడి పనుల కోసం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ ఉండదు.
జగ్గయ్యపేట పట్టణం, ఆటోనగర్, మల్కాపురం గ్రామ ప్రజలు ఈ పనులకు సహకరించాలని కోరారు. మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఈ అంతరాయం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...