Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ దుమారం: ఆ ఇద్దరి రహస్యం బట్టబయలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 29, 2026 2:40 PM హైదరాబాద్General
రాజకీయ దుమారం: ఆ ఇద్దరి రహస్యం బట్టబయలు - Udayam
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ బిల్లా, రంగాలాగే వ్యవహరించారని ఆయన విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో బీజేపీ ప్రేక్షకపాత్ర పోషించిందని, మోదీ హామీ ఇచ్చిన ఉద్యోగాల ఊసే లేదని మండిపడ్డారు.

Comments

G
Loading comments...