వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో నల్గొండ సీసీఎస్ పోలీసులు జరిపిన కాల్పుల్లో దొంగతనాల నిందితుడు భూష్మి శ్రీకాంత్ గాయపడ్డాడు. నిందితుడు పోలీసులపై దాడికి యత్నించడంతో అధికారులు కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీకి చెందిన శ్రీకాంత్పై పదికి పైగా దొంగతనం కేసులు, ఒక కానిస్టేబుల్ హత్య కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...