వార్తలకు తిరిగి వెళ్లండి
యాదగిరిగుట్టలో అతిథి గృహాల నిర్మాణం

యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో భక్తుల వసతి కోసం అతిథి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. తిరుమల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాటేజీలను నిర్మించేందుకు దాతలకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.
పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న పెద్దగుట్టపై 200కు పైగా ప్లాట్లలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో భక్తుల వసతి సమస్య తీరడంతో పాటు, యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చెందనుంది.
Comments
Loading comments...