వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సులో మంటలు రావడానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిపో సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది.
Comments
Loading comments...