Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి: స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. విద్యార్థి మృతి

పార్వతి దేవి Jun 30, 2026 12:29 PM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ముంబయి చెంబూర్‌లో స్కూల్ బస్సుపై చెట్టు విరిగిపడటంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. బస్సులోని 18 మందిలో పదిమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదకరమైన చెట్లపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో చిక్కుకున్న మరొక విద్యార్థి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...