Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ కాదు.. పోలవరమే ముప్పు: KTR

అనురూప్ గౌడ్ Jul 11, 2026 8:37 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
మేడిగడ్డ కాదు.. పోలవరమే ముప్పు: KTR - Udayam Digital
మేడిగడ్డ నింపితే భద్రాచలానికి ముప్పు వస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. భద్రాచలానికి ముప్పు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదని, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్లే అసలైన ముప్పు పొంచి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ పట్టిసీమ వద్ద నీటిని ఎత్తిపోస్తుంటే సీఎం కన్నెపల్లి పంపులపై కనీసం సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు.

Comments

G
Loading comments...