వార్తలకు తిరిగి వెళ్లండి
టన్నుల కొద్దీ పాత బంగారాన్ని విక్రయిస్తున్న జనం

దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటంతో, భవిష్యత్తులో ధరలు మరింత పడిపోతే నష్టపోతామనే భయంతో ప్రజలు తమ వద్దనున్న పాత బంగారాన్ని భారీగా విక్రయిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. కేవలం ఏప్రిల్-జూన్ (APR-JUN) త్రైమాసికంలోనే ప్రజలు ఏకంగా 50 టన్నుల బంగారాన్ని అమ్మేయడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పాత బంగారం విక్రయాలు ఏకంగా 43 శాతం పెరిగాయి.
Comments
Loading comments...