వార్తలకు తిరిగి వెళ్లండి
భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం

వ్యూహాత్మక రక్షణ పరిశోధనల వేగాన్ని పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘డిఫెన్స్ ఫైనాన్షియల్ పవర్స్ (DFP-2026)’ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. డీఆర్డీఓలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం.
నూతన నిబంధనల ద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థలతో భాగస్వామ్యం బలపడి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు వేగవంతం అవుతాయని మంత్రి తెలిపారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వ్యవస్థలను సకాలంలో సైన్యానికి అందించేందుకు ఈ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ ఎంతగానో దోహదపడనుంది.
Comments
Loading comments...