వార్తలకు తిరిగి వెళ్లండి
ఓయో ఐపీఓ: రూ. 6,650 కోట్ల సమీకరణ

బడ్జెట్ హోటళ్ల బ్రాండ్ ‘ఓయో’ మాతృ సంస్థ ప్రిజమ్, ఐపీఓ ద్వారా రూ. 6,650 కోట్ల నిధులను సేకరించనున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్ని అంటే రూ. 4,987.5 కోట్లను కంపెనీ రుణాల చెల్లింపునకు వినియోగించనుంది.
సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ లేదా సాఫ్ట్బ్యాంక్ వంటి ప్రధాన పెట్టుబడిదారులు ఎవరూ తమ వాటాలను ఈ ఐపీఓలో విక్రయించడం లేదని వెల్లడించింది. మరోవైపు, మంగళవారం మార్కెట్లు ఐటీ, బ్యాంకింగ్ రంగాల అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి.
Comments
Loading comments...