Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

లక్ష్మి దేవి Jun 30, 2026 2:37 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
హెచ్‌డీఎఫ్‌సీ కొత్త ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ - Udayam Digital
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కొత్త ఛైర్మన్‌గా నియమించింది. ఆర్‌బీఐ అనుమతి లభించిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అతాను చక్రవర్తి రాజీనామాతో ఈ నియామకం జరిగింది. బ్యాంకింగ్ రంగ సంస్కరణల్లో రాజీవ్‌కు విస్తృత అనుభవం ఉంది. మొండి బకాయిల ప్రక్షాళన, డిపాజిట్ల బీమా పెంపు వంటి కీలక నిర్ణయాల్లో ఆయన గతంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన నాలుగేళ్ల పాటు స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

Comments

G
Loading comments...