వార్తలకు తిరిగి వెళ్లండి
నికిత పాండే రిలీజ్పై ఢిల్లీ హైకోర్టు స్టే పొడిగింపు

భారత వైమానిక దళ (IAF) అధికారి వింగ్ కమాండర్ నికిత పాండే సర్వీస్ ముగింపు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను పొడిగించింది. దీనిపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎయిర్ఫోర్స్ అధికారులను కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సెలవుల సమయంలో ఏకపక్షంగా రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంపై నికేత తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటివరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Comments
Loading comments...