వార్తలకు తిరిగి వెళ్లండి
లడఖ్లో విద్యుత్ వెలుగులు

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో ఢిల్లీలో సమావేశమయ్యారు. రిమోట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు, అభివృద్ధి ప్రాజెక్టుల అనుమతులపై వీరు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ ప్రాజెక్టులకు పూర్తి సహకారం, వేగవంతమైన అనుమతులు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. లడఖ్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న వినూత్న చర్యలను ఈ సందర్భంగా ఎల్జీ వివరించారు.
Comments
Loading comments...