వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-దక్షిణ కొరియా సరికొత్త వ్యూహం

భారత్-దక్షిణ కొరియా దేశాల మధ్య 90ల నాటి పెట్టుబడుల బంధం తర్వాత, ఇప్పుడు రెండో విడత పారిశ్రామిక సహకారానికి సమయం ఆసన్నమైందని భారత్లో దక్షిణ కొరియా రాయబారి లీ సియాంగ్ హో అభిప్రాయపడ్డారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేరిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047' లక్ష్య సాధనలో కొరియా కీలక భాగస్వామి కానుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే షిప్బిల్డింగ్లో అగ్రగామిగా ఉన్న కొరియా, భారత్తో చేతులు కలపడం ద్వారా ఈ రంగంలో విప్లవాత్మక పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...