వార్తలకు తిరిగి వెళ్లండి
'హైదరాబాద్ ప్లస్' టార్గెట్: చంద్రబాబు

దేశం మొత్తం గర్వపడేలా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నామని, దీని అభివృద్ధి 'హైదరాబాద్ ప్లస్' తరహాలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్మాణ సంస్థలతో రాజధాని పనుల ప్రగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నిర్మాణ సంస్థలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Comments
Loading comments...