వార్తలకు తిరిగి వెళ్లండి
కార్మికులే కేంద్రంగా నయా టెక్నాలజీ: మన్సుఖ్ మాండవీయ

హైదరాబాద్లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సును కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. సాంకేతిక పురోగతి కేవలం లాభాల కోసం కాకుండా, సామాజిక న్యాయం, మానవ గౌరవం చుట్టూ తిరగాలని పిలుపునిచ్చారు.
బాధ్యతాయుతమైన ఆవిష్కరణలతోనే అంతర్జాతీయంగా కార్మిక రంగానికి భరోసా లభిస్తుందన్నారు. కార్మికుల సంక్షేమమే కేంద్రంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరగాలని, సాంకేతికత మానవ విలువలను సంరక్షించాలని బ్రిక్స్ ప్రతినిధుల సమక్షంలో ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...