వార్తలకు తిరిగి వెళ్లండి
అనాథ చిన్నారులకు కొత్త జీవితం

పురిట్లోనే వదిలేయబడిన చిన్నారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ అక్కున చేర్చుకుంటోంది. 2010 నుంచి చట్టబద్ధంగా దత్తత ప్రక్రియను చేపట్టి, ఆ చిన్నారులకు కొత్త ఆశలను కల్పిస్తోంది. దత్తత తీసుకునే వారిలో అత్యధికులు బాలికలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
దత్తత కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవాంఛిత శిశువులను ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసిన 'ఊయల'లో వదిలితే, ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి మెరుగైన భవిష్యత్తును కల్పిస్తుంది.
Comments
Loading comments...