వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలను బుధవారం అకాల భారీ వర్షాలు ముంచెత్తాయి. అంధేరి, మలాడ్, బోరివాలి తదితర లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంధేరి సబ్వేలో భారీగా నీరు చేరడంతో అధికారులు రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు.
నగరంలో గరిష్టంగా 69 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...
