వార్తలకు తిరిగి వెళ్లండి

గతేడాది కోల్కతాలో జరిగిన లియోనెల్ మెస్సి ఈవెంట్కు హాజరైన సుమారు 33 వేల మందికి టికెట్ సొమ్మును తిరిగి చెల్లిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటించారు. రీఫండ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
టికెట్ల కోసం ఒక్కొక్కరు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించగా, సొమ్ము తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వానికి దాదాపు రూ.16.50 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

