వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రీలాంచ్ పేరుతో భారీ మోసం
Harika Jun 19, 2026 5:46 AM హైదరాబాద్ 6 views2 days ago

తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని నమ్మించి 340 మంది నుంచి రూ.70 కోట్లు వసూలు చేసిన భారతీ బిల్డర్స్ ప్రతినిధులపై కేసు నమోదైంది. నిర్మించాల్సిన భూమిని రుణం కోసం మరొకరికి బదిలీ చేసి యాజమాన్యం కొనుగోలుదారులను మోసగించింది.
గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు బాధితులు గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రీలాంచ్ ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...