Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదాతపై మోయలేని భారం

Follow Udayam on Google
Krishna Jun 21, 2026 11:21 AM యాదాద్రి భువనగిరిGeneral
అన్నదాతపై మోయలేని భారం - Udayam
రాజపేట, భువనగిరి పరిసరాల్లో ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వానాకాలం పంటల సాగు రైతులకు భారంగా మారింది. ట్రాక్టర్ దున్నకం ఖర్చులు కూడా ఎకరానికి రూ.1500 వరకు అదనంగా పెరిగాయి. మరోవైపు బ్యాంకు రుణాల కోసం ఆర్‌బీఐ కొత్త ఆంక్షలు విధించడంతో చిన్న, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులు పెరిగి, వర్షాలు లేక అన్నదాతలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

Comments

G
Loading comments...