Back to feed
భారీగా గంజాయి పట్టివేత
Vikram Jun 18, 2026 8:54 AM హైదరాబాద్ 5 views2 days ago

తెలంగాణకు తరలిస్తున్న 500 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ అధికారులు ఒడిశాలో స్వాధీనం చేసుకున్నారు. అడవి మార్గంలో బొలెరో వాహనాన్ని వెంబడించి, 115 ప్యాకెట్ల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. డ్రైవర్ పరారవగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదకరమైన ఈ ఆపరేషన్ నిర్వహించిన బృందాన్ని ఒడిశా పోలీసులు అభినందించారు. గంజాయిని, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్పగించామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...



