Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో న్యాయవాదుల క్రికెట్ పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 12:16 PM మంచిర్యాలతెలంగాణ
మంచిర్యాలలో న్యాయవాదుల క్రికెట్ పోటీలు ప్రారంభం - Udayam
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మంచిర్యాల జిల్లా జడ్జి వీరయ్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో న్యాయవాదుల క్రికెట్ పోటీలను జడ్జి వీరయ్య మంగళవారం ప్రారంభించారు. న్యాయవాదులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడిన జడ్జి.. నిత్యజీవితంలో బిజీగా ఉండేవారికి ఆటలు ప్రశాంతతను ఇస్తాయన్నారు. ఈ పోటీల్లో న్యాయవాదులు జట్లుగా ఏర్పడి పోటాపోటీగా తలపడుతున్నారు.

Comments

G
Loading comments...