వార్తలకు తిరిగి వెళ్లండి
రాజ్యసభ సభ్యునిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన నేపథ్యంలో, సోమవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ప్రజల గొంతుకగా పార్లమెంటులో చిత్తశుద్ధితో వ్యవహరిస్తానని ఖర్గే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...