వార్తలకు తిరిగి వెళ్లండి
జార్ఖండ్లో మలేరియా కలకలం: హెల్త్ అలర్ట్ జారీ

తూర్పు సింగ్భూమ్ జిల్లాలో మలేరియా వల్ల నలుగురు రోగులు మరణించడంతో జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ అలర్ట్ ప్రకటించింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
హై-రిస్క్ గ్రామాల్లో జ్వరం సర్వేలు, వేగవంతమైన మలేరియా పరీక్షలు, మందుల పంపిణీ చేయనున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చాలని, ఫాగింగ్ ముమ్మరం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...