వార్తలకు తిరిగి వెళ్లండి
మచిలీపట్నం: డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
పవన్ కుమార్ Jun 27, 2026 6:00 AM కృష్ణా జిల్లా 1 viewsabout 2 hours ago

మచిలీపట్నంలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...