వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్పీజీ యూజర్లకు అలర్ట్: రేపటితో ముగియనున్న గడువు

జూలై 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇప్పటికే పైప్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్ను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
అంతేకాకుండా, వినియోగదారులందరూ తప్పనిసరిగా జూన్ 30లోగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని హెచ్చరించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో, గ్యాస్ సేవలు నిలిచిపోవడంతో పాటు సిలిండర్ బుకింగ్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...