Back to feed
వడ్డీ ఎర వేసి మోసం: కిలాడీ లేడీ అరెస్ట్
Priya Jun 17, 2026 5:46 AM హైదరాబాద్ 18 viewsabout 5 hours ago

హైదరాబాద్ బంజారాహిల్స్లో అధిక వడ్డీ ఆశ చూపి రూ. 2 కోట్లు వసూలు చేసిన శ్రీలక్ష్మిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిగా పరారీలో ఉన్న ఈమెను చివరకు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
స్థానికుల నుంచి పెట్టుబడులు సేకరించి దంపతులు బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలి భర్త సత్యప్రసాద్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.
Comments
Loading comments...



