వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అప్పులపై చర్చకు సిద్ధమంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్తో హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సవాల్కు స్పందిస్తూ కేటీఆర్, హరీశ్రావు తెలంగాణ భవన్లో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
నేతల రాకతో తెలంగాణ భవన్, గన్పార్క్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించాయి. ఇరుపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు.
Comments
Loading comments...

